Followers

Search This Blog

Theme images by MichaelJay. Powered by Blogger.

About Simpro

Find Us On Facebook

About Me

My photo
hi, Iam Ravindra nath Tagore. I have to create this blog to write articles on some great persons and social elements to motivate all. This is very useful to you.

Gallery

About the Author

Featured post

గాంధీజీ ఆత్మహత్యాప్రయత్నం..! -- గాంధీ జీవిత విశేషాలు -- 03

                  జీవితంలో మంచి వ్యక్తుల స్నేహం మంచి జీవితాన్ని ప్రసాదిస్తే, చెడు స్నేహం మాత్రం జీవితపు లోతులను తెలుసుకోగలిగేలా చేస్...

Contact Form

Name

Email *

Message *

Popular Posts

గాంధీజీ ఆత్మహత్యాప్రయత్నం..! -- గాంధీ జీవిత విశేషాలు -- 03


                  జీవితంలో మంచి వ్యక్తుల స్నేహం మంచి జీవితాన్ని ప్రసాదిస్తే, చెడు స్నేహం మాత్రం జీవితపు లోతులను తెలుసుకోగలిగేలా చేస్తుంది. గాంధీజీ జీవితంలో కూడా అచ్చం ఇలానే జరిగింది, తన చెడు మిత్రుని స్నేహం వలన గాంధీ జి తన జీవితంలో ఎన్నో చీకటి రోజులను అనుభవించవలసివచ్చింది. ఇతరుల్ని సంస్కరించాలనే బలమైన కోరిక గాంధీజీ ని నిలువునా ముంచివేసింది. వ్యభిచారపు కోరల్లో చిక్కుకున్నాడు, చివరికి తాను కట్టుకున్న ధర్మపత్నిని కూడా అనుమానించాడు.

➤ వ్యభిచార గృహ ప్రవేశం:-
  
                ఆ మిత్రుడి స్నేహం గాంధీజీ ని వ్యభిచార రంగం లోకి కూడా దింపేదే , కానీ ఆ సంఘటన నుండి తృటిలో బయటపడ్డాడు గాంధీజీ.ఒక రోజు ఆ మిత్రుడు గాంధీజీ ని వేశ్య ఇంటికి తీసుకుపోయాడు. గాంధీజీ కి కొన్ని వివరాలు చెప్పి గది లోకి పంపాడు. కావలసిన ఏర్పాట్లు అది వరకే చేసాడు, ఇవ్వవలసిన సొమ్ము కూడా అదివరకే ఇచ్చివేశాడు. గాంధీజీ ఆ పాపపు కోరల్లో చిక్కుకుని పోయాడు. గాంధీజీ కి నోటమాట రాలేదు. ఆ సమయంలో శరీరం లోని అవయవాలు అచేతన స్థితికి పడిపోయాయి. పరుపు మీద గాంధీజీ ఆమె పక్కన కూర్చున్నాడు. కానీ నోటి నుండి మాట లేదు, వెర్రి వేగం తో కొట్టుకుంటున్న తన  గుండె శబ్దం తనకు స్పష్టంగా వినిపిస్తున్నది.ఒక వైపు  చెమట కారుతుంది, మరో వైపు కాళ్ళు, చేతులు వణుకుతున్నాయి. ఈ దారుణమైన పరిస్థితి నుండి తనని రక్షించమని ఆ భగవంతుడిని శతవిధాలా వేడుకున్నాడు గాంధీ,  కానీ ఇదంతా గమనిస్తున్న ఆమె చాలా సేపు ఓపిక పట్టింది. ఎటువంటి స్పందన లేక విగ్రహం లా కూర్చున్న గాంధీజీ ని ఆమె తిట్టడం ప్రారంభించింది.ద్వారం వైపు చూపి వెళ్లిపొమ్మని చెప్పింది. ఆ పరిస్థితిలో గాంధీజీ కి తన పై తనకు సిగ్గు వేసిన , ఆ తరువాత అటువంటి పరిస్థితిలో తనను కాపాడినందుకు గాంధీ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. గాంధీ జీవితంలో ఇటువంటి పరిస్థితి నాలుగు సార్లు ఎదురైనప్పటికీ , అదృష్టం వల్ల వాటి నుండి తప్పించుకున్నాడు.


                   
                       ఇంతటి దారుణమైన పరిస్థితి ని అనుభవించినప్పటికీ ఇంకా గాంధీ కళ్ళు మూసుకుని పోయే ఉన్నాయి. ఈ సారి ఏకంగా ఆ మిత్రుడి మాటలు నమ్మి తాను అగ్ని సాక్షి గా మనువాడిన తన ధర్మ పత్ని అయిన కస్తూర్భా గాంధీ ని కూడా అనుమానించాడు, తన మిత్రుడు చెప్పిన మాటలను గాంధీ గుడ్డిగా నమ్మాడు, ఆమెను కష్టాల పాలు చేసాడు, హింసించాడు. కానీ ఆ తరువాత  తాను చేసిన తప్పుకు ఎంతో చింతించాడు. ఆ తరువాత తన తప్పు తెలుసుకున్న గాంధీ భార్య , భర్త కు దాసి కాదని, అతడి సహచారిణి అని, సహధర్మ చారిణి  అని,ఇద్దరికి సుఖ దుఃఖాలలో సమాన భాగస్వామ్యం ఉందని తెలుసుకోగలిగాడు. ఆనాడు తన భార్య పట్ల  మూర్ఖంగా వ్యవహరించినందుకు గాంధీజీ కి తనపై తనకే కోపం వేసేది.

➤ సిగరెట్ల కోసం ఆత్మహత్యా ప్రయత్నం :- 

          ఆ మిత్రుడి సావాసం వదిలేసిన తరువాత ఈ సారి గాంధీజీ కి తన బంధువైన  ఒకరితో స్నేహం కుదిరింది. ఒక సమయంలో గాంధీజీ కి తన బంధుమిత్రుడి కి సిగరెట్ తాగాలని ఆశ కలిగింది, కానీ చేతిలో డబ్బు లేదు, సిగరేట్ తాగితే గల ప్రయోజనం ఏమిటో. దాని వాసనతో గల మజా ఏమిటో ఇద్దరిలో ఎవ్వరికీ తెలీదు, కానీ పొగ తాగాలన్న ఆశ మాత్రం వదల్లేదు. గాంధీజీ పినతండ్రికి కి కూడా ఈ అలవాటు ఉండేది. కొని తాగడానికి చేతిలో డబ్బులేక వారి పినతండ్రి కాల్చి పారేసిన సిగరెట్ ముక్కలను ఏరుకుని తాగేవారు. అయితే అవి అనుకున్నప్పుడల్లా దొరికేవి కావు, దొరికిన ఎక్కువ పొగ వచ్చేవి కాదు, అందువల్ల ఇంట్లో పనిచేసే నౌకర్ల డబ్బు దొంగలించి వాటితో బీడీలు కొని తాగేవారు. కొన్ని రోజుల పాటు ఈ తతంగం బాగానే సాగింది. అయితే  ఈ పద్ధతి కూడా అనుకున్నప్పుడల్లా సాధ్యపడేది కాదు. అందుకే ఈ సారి కొన్ని మొక్కల కాడలకు సన్నని బెజ్జాలు ఉంటాయని , వాటిని సిగరెట్లుగా మాదిరిగా కాల్చవచ్చని ఎక్కడో విన్నారు. వాటిని కూడా ప్రయత్నించి చూసారు. అయినా వీటితో కూడా తృప్తి కలగలేదు. తమ ప్రయత్నాలన్ని విఫలమైనా ఇద్దరికీ పొగ తాగటం మీద కోరిక మాత్రం  చావలేదు.

                      
                        తమ పరిస్థితి మీద ఇద్దరికీ విసుగు వచ్చింది. పెద్దల అనుమతి లేకుండా ఏమి చేయలేకపోతున్నందుకు వారి మీద వారికే భాధ వేసింది. తమకు స్వాతంత్య్రం లేనందుకు ఎంతగానో చింతించారు. చివరికి విసిగి వేసారి పోయి, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉమ్మెత్త గింజలు విషం అని తెలుసుకున్నారు, వాటి కోసం వెతుకుంటూ అడవికి వెళ్లి వాటిని తీసుకువచ్చారు. సాయంకాలం వాటిని తినాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న ముహూర్తానికి కేదరేశ్వరుని ఆలయానికి వెళ్లి దీపం ప్రమిదలో నెయ్యిపోసి దానిని  వెలిగించి, ఇద్దరు దైవ  దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత ఆలయం నుండి బయటకు వచ్చి, నిర్మానుష్య ప్రాంతం కోసం వెదికారు. ఎవ్వరు లేని చోటుకు వెళ్లి చావాలనుకున్నారు. అలా ఒక  చోటుకి వెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ..... ఇదే సమయంలో వింత ఆలోచనలు ఇద్దరినీ చుట్టుముట్టాయి. వెంటనే ప్రాణం పోకపోతే ఎలా..?, చస్తే ఏం లాభం ..?, ఎవరికి లాభం..?, చచ్చి ఏం సాధించినట్టు, స్వాతంత్య్రం లేకుండా బ్రతకకూడదా..? వంటి ఆలోచనలతో ఇద్దరి బుర్ర వేడెక్కిపోయింది. ఒకరి కళ్ళల్లో మరొకరికి మృత్యు భయం స్పష్టంగా కనిపిస్తుంది. మరణ భయం తో కాళ్ళు, చేతులు వణుకుతున్నాయి, ప్రాణ భయం తో వేడెక్కిన చెమట శరీరం నుండి కారుతుంది. అంతే మృత్యు ఆలోచనలను చూసిన వారు చేతిలో ఉన్న ఉమ్మెత్త గింజలను కిందకు పడేసారు. ఇప్పుడు బ్రతకాలన్న ఆశ ఇద్దరికీ మొదలయింది. కానీ.... అప్పటికే గాంధీ మూడు ఉమ్మెత్త గింజలను తిన్నాడు. చావంటే భయం తో , బ్రతకాలన్న కోరికతో ప్రాణాలు నిలుపుకునేందుకు రామ మందిరానికి పరుగు తీశారు, అక్కడ దేవుడిని ప్రార్థించి, ఇక మెల్లగా ఇద్దరు ఇంటి ముఖం  పట్టారు.

                                         జీవితంలో మనకు తారసపడే ప్రతి ఒక్కరు మనకు కొత్త పాఠాన్ని నేర్పుతారు. అది మంచి వ్యక్తులైనా  , చెడ్డ వ్యక్తులైనా , అందులో కొందరు ఎలా బతకాలో నేర్పిస్తే, మరికొందరు ఎలా బతకకూడదో నేర్పిస్తారు. కొందరు ఏది ఒప్పో తెలియజేస్తే , మరికొందరు ఏది తప్పో తెలియజేస్తారు. ఏది ఏమైనా కొత్త వ్యక్తుల సాంగత్యం మాత్రం ఏదో ఒకటి కొత్తగా నేర్పిస్తూనే ఉంటుంది. చెడు వ్యక్తుల స్నేహం వలన చిన్న వయసులోనే గాంధీజీ  జీవితపు చీకటి కోణాన్ని తెలుసుకున్నాడు.  ఆ స్నేహమే తన ఆలోచనలు మార్చుకునేలా, తనను తాను ఎప్పటికప్పుడు నూతనంగా ఆవిష్కరిచుకునేలా చేసింది.  


                         జీవితంలో మనం ఎంత గొప్ప స్థితికి చేరుకున్నప్పటికీ బాల్యం యొక్క మధురానుభూతులు కళ్ళ ముందు కదలాడగానే కళ్ళు చెమర్చక తప్పదు. తన అందమైన అనుభవాలతో గుండె ను బరువు చేయగల శక్తీ ఒకే ఒక్క బాల్యానికి మాత్రమే ఉంది. అందుకే  ప్రతి ఒక్కరికి బాల్యం తిరిగిరాని ఒక  మధురమైన అనుభవం. భారత దేశానికీ జాతిపితగా , ప్రపంచ దేశాలకు అహింసావాదిగా చరిత్రలో  చిరకాలం నిలిచిపోయే గాంధీజీ తన బాల్యంలో ఎన్నో తుంటరి పనులు చేసాడు. తన స్నేహితులతో కలిసి ఎనో అల్లరి పనులు చేసి, తన బాల్యాన్ని అందమైన అనుభవంగా మలుచుకున్నాడు.

                     మరి మీ బాల్యం..?
                                               
                                                                               written by,
                                                                                   M.R. Ravindra Nath Tagore

                                                                                   మూలం :సత్యశోధన

     
                      

➣ Next Episode:-

                  మనలో  ఎవ్వరూ  థామస్ అల్వా ఎడిసన్ ను నిజంగా చూడలేదు. ఐన్ స్టీన్ యొక్క గొప్పలు వినడమే తప్ప అతని మేధస్సు ను కళ్లారా చూసే  అదృష్టం మనలో ఎవరికి లేదు. Newton laws చదవటమే తప్ప అతనితో  మనకెవ్వరికి పెద్దగా పరిచయం లేదు. చరిత్ర గతిని , మానవ జీవన విధానాన్ని సమూలంగా మార్చివేసే ఆవిష్కరణలు చేసిన ఎందరో శాస్త్రవేత్తలు ఈ నేల పై నడయాడినప్పుడు మనమింకా ఊపిరి పోసుకోలేదు. కానీ ఒక్క వ్యక్తి గురుంచి తెలుసుకుంటే అతను బ్రతుకుతున్న ఈ 21 వ  శతాబ్దంలో  నేను కూడా బ్రతికాను అని  సగర్వంగా చెప్పుకోవచ్చు. అతని గురుంచి పూర్తిగా తెలుసుకుంటే ఇతనికి మానవాతీత శక్తులు కానీ ఉన్నాయా..? మంత్రాలు , తంత్రాలు కానీ తెలుసా...? అని ఆశ్చర్యపోక  తప్పదు. ఎందుకంటే అతను అందరిలా ఈ ప్రపంచం మారాలి అని అనుకోలేదు, తన మేధస్సుతో ...., తన ఆలోచనలతో.... తన ఆవిష్కరణలతో ఈ ప్రపంచాన్ని మారుస్తున్నాడు.
                                                                                 ఎవరతను..?
                                                                                             తెలుసుకోవాలంటే
just wait ....
               అంతకన్నా ముందు, TheTagoreTimes.blogspot.com ను మీ మెయిల్ తో ఫాలో అవ్వండి.


                                             ****comment below****
Read More
    13

కొంప ముంచిన గాంధీజీ చెడు స్నేహం..! -- గాంధీ జీవిత విశేషాలు -- 02



                      గాంధీజీ హైస్కూల్ లో చదువుతున్నరోజులు అవి, అప్పటికే గాంధీజీ కి పెళ్లి కూడా అయ్యింది. ఆ సమయం లోనే గాంధీజీ కి తన అన్నగారి మిత్రుడైన ఒక వ్యక్తి తో పరిచయం అయ్యింది, ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. కానీ ఆ మిత్రుడి చెడు  అలవాట్ల వలన గాంధీ వాళ్ళ అన్నయ్య , అమ్మ ఈ స్నేహాన్ని మానుకోమని చెప్పారు, చివరికి కస్తూరిబా చెప్పినా కూడా వినలేదు, " అతడికి చెడు అలవాట్లు ఉన్న మాట నిజమే, కానీ అతనిలో ఉన్న సుగుణాల గురుంచి మీకు తెలియదు, అతడు నన్ను చెడగొట్టలేదు, నేను అతనిని మంచి దారికి తీసుకువచ్చి , ఉత్తమ వ్యక్తి గా తీర్చిదిద్దటానికే అతనితో స్నేహం చేస్తున్నాను", అని గాంధీజీ వారిని కష్టపడి ఒప్పించాడు , ఈ అనాలోచిత  నిర్ణయం వల్ల  గాంధీజీ తన జీవితంలో కొన్ని  చీకటి రోజులను అనుభవించవలసి వచ్చింది.

                  ఆ వ్యక్తి ఒక రోజు గాంధీ తో మన ఉపాధ్యాయుల్లో చాలా మంది చాటుగా మద్యాన్ని , మాంసాన్ని సేవిస్తున్నారు అని గాంధీజి కి చెప్పాడు , ఇది విన్న గాంధీజీ వింత ఆశ్చ్యరానికి కొంత బాధకు కూడా లోనయ్యాడు. ఆ మిత్రుడు ఇంతటితో ఆగలేదు,  " మనం మాంసం తినము, అందువల్ల మన జాతి బలహీనంగా తయారవుతుంది, తెల్లవాళ్లు మాంసభోజులు , అందువల్లనే వాళ్ళు మనల్ని పరిపాలించగల్గుతున్నారు , నన్ను చూడు , బలశాలిని,వేగంగా పరిగెత్తగలను, ఈ విషయం  నీకు తెలుసు, నేను మాంసాహారిని కావటమే అందుకు కారణం, మాంసాహారులకు  వ్యాధులు రావు, వచ్చినా  తొందరగా మానిపోతాయి. మన ఉపాధ్యాయులు , రాజకోట ప్రముఖులు వెర్రివాళ్ళు కాదు, వాళ్ళు మాంసం ఎందుకు తింటారనుకున్నావు , మాంసం వల్ల  కలిగే ప్రయోజనాలు   వారికి  బాగా తెలుసు, నువ్వు కూడా వారి లాగే మాంసం తిను , ఎంత బలం వస్తుందో..? అని  అలా మాటలతో మెల్లమెల్లగా గాంధీజీ ని  మార్చటం మొదలు పెట్టాడు. 

             చాల సార్లు ఇవే మాటలు ఆ  మిత్రుడు చెప్పటం తో ,గాంధీజీ కూడా ఈ విషయం గురుంచి దీర్ఘంగా ఆలోచించటం మొదలు పెట్టాడు. అతడు చెప్పింది సరైనదేనని గాంధీజీ కూడా భావించాడు, ఎందుకంటె ఆ మిత్రుడు గాంధీజీ కన్నా చాలా బలవంతుడు, ఎంతదూరమైనా రివ్వున పరిగెత్తగలడు, ఎన్ని దెబ్బలు కొట్టిన కిమ్మనడు, పరాక్రమంలో అతనిని మించిన వారు లేరు, అందుకే అతన్ని చూసి గాంధీజీ కూడా ఆశ్చ్యర్యపడేవాడు, అతనిలా బలశాలి కావాలని గాంధీజీ కి కూడా కోరిక కలిగింది. ఎందుకంటె గాంధీజీ ఆ సమయంలో చాల పిరికివాడు, దొంగలన్నా , దయ్యాలన్నా, పాములన్నా చాల భయం, ఈ భయాన్ని దాటి బయటకు రావాలి  అంటే మాంసం తిని బలవంతుడు అవటమే మార్గం  అని గాంధిజీ నమ్మాడు. 
 

               ఇక మాంసభక్షణకు ముహూర్తం నిర్ణయమైంది , కానీ ఈ తతంగమంతా చాల రహస్యంగా జరగాలని గాంధీజి నిర్ణయించుకున్నాడు, ఎందుకంటె గాంధీజీ కుటుంబానిది  వైష్ణవ సంప్రదాయం,వారు మాంసభక్షణకు పూర్తిగా వ్యతిరేకులు. ఈ విషయం వారికి తెలిస్తే వారి గుండెలు బద్దలైపోతాయని గాంధీజీ భయం .
            నిర్ణయించిన రోజు రానే  వచ్చింది, ఆ సమయంలో గాంధీజీ కళ్ళలో ఒక వైపు తప్పు చేస్తున్నాన్న భయం , మరొకవైపు బలం సంపాదించి , పరాక్రమవంతుడిని కావాలన్నా కోరిక. ఈ ఆలోచనలతోనే గాంధీజీ , తన మిత్రుడు తెచ్చిన మేక మాంసం ని రుచి చూసాడు. కానీ దానిని మింగటం సాధ్యం కాలేదు. అతి కష్టం మీద చివరికి మాంసాన్ని కడుపులోకి నెట్టుకున్నాడు . కానీ గాంధీజీకి ఆ రోజు రాత్రి చాలా కష్టం అయిపొయింది, ఏవేవో పీడ కలలు రాసాగాయి , కడుపులో ఉన్న మేక మే మే అని అరిచినట్టనిపించింది. ఆ రాత్రి గాంధీజీ కి కాళ  రాత్రిలా అయింది.


               ఆ మిత్రుడు గాంధీజీ ని అంతటితో వదలలేదు, ఖరీదైన హోటళ్లకు తీసుకుపోయి, మాంసానికి సంబంధించిన వివిధ రకాల వంటలను గాంధిజీ కి రుచి చూపించటం మొదలు పెట్టాడు. గాంధీజీ కూడా మెల్లగా మాంసపు రుచికి బాగా అలవాటుపడ్డాడు. మాంసపు విందులకు సంబందించి మొత్తం ఖర్చు ఆ మిత్రుడే భరించేవాడు, ప్రతి సారి అంత సొమ్ము ఎలా వచ్చేదో గాంధిజీ కూడా అర్థమయ్యేది కాదు, గాంధీజీ  ని మాంసాహారిగా మార్చాలని, బలిష్ఠుణ్ణి చేయాలని బలమైన కోరిక ఆ మిత్రుడి లో బలంగా ఉండేది. ఇలా ఒక సంవత్సరం పాటు సాగిన ఈ తతంగం , మెల్లమెల్లగా డబ్బులేక తగ్గిపోయింది. 

                 దొంగతనంగా విందులు ఆరగించిన తరువాత గాంధీజీ కి ఆకలి వేసేది కాదు, ఇంటికి వచ్చి ఆకలి లేదని చెప్పేవాడు, కానీ గాంధీ వాళ్ళ అమ్మ అన్నానికి పిలిచేది, ఆకలి లేదంటే కారణం అడిగేది, అప్పుడు గాంధీజి అన్నం అరగలేదు , అందువల్ల ఆకలి లేదు అని అబద్దం చెప్పేవాడు. అమ్మకు అబద్దం చెబుతున్నందుకు గాంధీజీ చాలా కుమిలిపోయేవాడు. తమ బిడ్డలు మాంసాహారులైనారని తెలిస్తే  తమ తల్లితండ్రుల గుండెలు బద్దలయిపోతాయని గాంధీజీ బాధపడేవాడు. 
             కన్న తల్లితండ్రులను, మోసం చేయటం, వారికీ అబద్దాలు చెప్పటం ధర్మం కాదు , ఎలాగైనా మాంసం తినకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు గాంధీజీ.  ఆనాటి నుండి గాంధీజీ మాంసాహారం పై మోహాన్ని పూర్తిగా వదులుకున్నాడు.


                            కానీ కథ ఇంతటితో అయిపోలేదు..,
                                              ఎందుకంటె  గాంధీజీ వదిలింది మాంసాహారాన్ని మాత్రమే, ఆ మిత్రుడి స్నేహాన్ని మాత్రం  ఇంకా వదలలేదు, అసలైన కథ ఇంకా ముందుంది.



 గాంధీజీ కి మాంసాహారాన్ని తినటం నేర్పించిన ఆ మిత్రుడు ఈ సారి, ఏకంగా , వ్యభిచారగృహానికి దారి చుపించాడు. అవును మీరు విన్నది నిజమే....!, చిన్నప్పుడు గాంధీజీ సిగరెట్లను తాగేవాడు వాటి కోసం డబ్బులు దొంగిలించేవాడు, ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసుకున్నాడు,
                అసలు ఎందుకు , ఎప్పుడు , ఎలా..?
                                                       ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురుంచి తెలుసుకోవాలంటే just wait ....
               అంతకన్నా ముందు, TheTagoreTimes.blogspot.com ను మీ మెయిల్ తో ఫాలో అవ్వండి.


                                                                               written by,
   
                                                                                   M.R. Ravindra Nath Tagore

                                                                                   మూలం :సత్యశోధన




గమనిక :- 
   ఆ వయసులో గాంధీజీ మాంసాహారాన్ని  తిన్నది కేవలం బలిష్టుడిగా తయారయ్యి , తెల్ల వాళ్ళను జయించాలన్న బలమైన కోరిక తప్ప, మాంసాహారాన్ని  రుచి చూసి, ఆ రుచిని అనుభవించాలన్న కోరిక మాత్రం గాంధీజీ లో లేదు. చిన్నతనం జరిగిన ఈ సంఘటన వల్ల గాంధీజీ ని తప్పుగా అర్థం చేసుకోకండి.
   
                                                   ****comment below****
Read More
    17

ఉపాధ్యాయుడే కాపీ కొట్టమని చెప్పినా, వినని గాంధీ...! - గాంధీ జీవిత విశేషాలు -- 01


              తరగతి గదిలో అంతా  నిశ్శబ్దం, ఒకవైపు ఉపాధ్యాయుడు గాంధీ వైపు కోపంగా చూస్తున్నాడు, చుట్టూ ఉన్న తన స్నేహితులు తనను చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు. ఆ నవ్వులో ఒక రకమైన అవమానం కనిపిస్తుంది. వారి చూపులు గాంధీ ని అమాయకుడిని చేస్తున్నాయి. కానీ గాంధీజీ మాత్రం తన సహనం ఏ మాత్రం కోల్పోలేదు, తాను చేసింది ఒప్పే అని , తాను ఏ తప్పు చేయలేదన్నట్లుగా తెలియపరిచే భావాలను తన ముఖంలో చూపిస్తున్నాడు. 
                                                అసలు ఏం జరిగింది, తరగతి గదిలో ఆ పరిస్థితులు  ఏర్పడటానికి గల కారణం ఏమిటి..?


            
                        అది గాంధీ హైస్కూల్  చేరిన మొదటి సంవత్సరం. ఆ రోజు తరగతి గదిలో పరీక్షలు జరుగుతున్నాయి. గాంధీ తన పరీక్షలో వ్రాయటం లో మునిగిపోయాడు, చాలా  శ్రద్దగా పరీక్షలు రాస్తున్నాడు. ఇంతలోనే విద్యాశాఖకు చెందిన జెయిల్స్ అనే అధికారి అకస్మాత్తుగా తరగతిగది లోకి ప్రవేశించాడు. అతన్ని చూసిన విద్యార్థులకు చెమటలు పట్టాయి. ఆ వెంటనే ఆ అధికారి విద్యార్థులు అక్షర జ్ఞానాన్ని పరీక్షించేందుకు ఓ ఐదు పదాలను రాయమని చెప్పాడు. వాటిలో కేటిల్ [kettle] అను పదం ఒకటి. దురదృష్టవశాత్తు గాంధీ ఈ పదాన్ని తప్పుగా వ్రాసాడు. ఇది చూసిన తన తరగతి ఉపాధ్యాయుడు గాంధీజి  కి సైగ చేసాడు. కానీ గాంధీ కి ఉపాధ్యాయుడు ఎందుకు సైగ చేస్తున్నాడో అర్థం కాలేదు. వెంటనే ఉపాధ్యాయుడు తన బూటు కాలితో నొక్కి తప్పును సరిదిద్దుకోమని , మరొక్క సారి సైగ చేసాడు. కానీ గాంధీ కి మాత్రం ఉపాధ్యాయుడి ప్రవర్తన అర్థం కాలేదు. ఎదురుగా ఉన్న పిల్లవాడి పలక చూసి తప్పు దిద్దుకోమని సైగ చేస్తున్నారన్న విషయం గాంధీ తెలుసుకోలేకపోయాడు. ఎదుటి వారి పలక నుండి చూసి రాయకుండా ఉండేందుకే ఉపాద్యాయుడు అక్కడ ఉన్నారని గాంధీజి భావన. అటువంటి ఉపాధ్యాయుడే తప్పు చేయమని ప్రోత్సహించటం గాంధీ కి నచ్చలేదు. మిగతా పిల్లలంతా ఆ ఐదు పదాలు సరిగ్గా వ్రాసారు, గాంధీ ఒక్కడు మాత్రం ఆ అధికారి చేత తిట్లు తినవలసి వచ్చింది. 

                     ఆ తరువాత ఆ ఉపాధ్యాయుడు గాంధీజీ ని పిలిచి మందలించాడు. తన అమాయకత్వాన్ని ,తనకు తెలియచేసాడు. కానీ గాంధీజీ కి మాత్రం ఉపాధ్యాయుడి ప్రవర్తన వింతగా తోచింది. ఈ సంఘటన జరిగిన తరువాత కూడా గాంధీజీ కి ఆ ఉపాధ్యాయుడి పై ఏ మాత్రం గౌరవం తగ్గలేదు. పెద్దల దోషాల్ని చూసి కళ్ళు    మూసుకోవాలని గాంధీజి భావన . ఆ తరువాత చాలా సార్లు ఆ ఉపాధ్యాయుడి ప్రవర్తన గురుంచి , అతడి దోషాల గురుంచి గాంధీజీ దృష్టికి వచ్చిన అతనిపై ఏ మాత్రం వినయం తగ్గలేదు గాంధీజీ కి .


           
                          సామాన్యంగా అందరూ  బతకగలరు, కానీ తాను నమ్మిన సిద్దాంతాలను ఆచరిస్తూ, వాటిని తన జీవితం లోకి అన్వయించుకుంటూ బతకగలటం కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది , అటువంటి వారే మహాత్ములుగా చరిత్ర పుటల్లో శిఖరాగ్రాన నిలిచి , జాతికి ఆదర్శం అవుతారు. చిన్నతనం లో జరిగిన ఆ సంఘటన గాంధీజీని మానసికంగా మరింత బలవంతుడిని చేసింది, సత్యానికి మరింత దగ్గరివాడ్ని చేసింది. అంత చిన్న వయసులో కూడా పక్క వారు ప్రేరేపించినా, తప్పు చేయాలన్న చిన్న తలంపు కూడా గాంధీజీ కు కలగలేదు. అందుకే మోహన్ దాస్ కరం చంద్ గాంధీ , మహాత్మా గాంధీ అయ్యాడు.కొన్ని కోట్ల మంది కలలు కన్న స్వేఛ్ఛా భారతాన్ని సాధించి పెట్టాడు.



                                                                                       written by ,
                                                                           M.R. Ravindra Nath Tagore




మూలం : సత్యశోధన 
Read More
    17

మీకు తెలియని మహాత్మ గాంధీ జీవిత విశేషాలు

 
                కొందరు మాత్రమే భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో కూడా అందరిచే ఆరాధింపబడుతూ తరగని చెరగని కీర్తి తో తరతరాలుగా  ధ్రువతారలా వెలిగిపోతుంటారు..., ఆ  పేరు వింటే ప్రతి ఒక్క భారతీయుడి గుండె దేశ భక్తి నిండిపోతుంది. తాను నమ్మిన సిద్ధాంతానికి చివరి వరకు కట్టుబడి, సత్యం , అహింసలనే ఆయుధాలుగా చేసుకుని, ఆనాటి బానిస భారతానికి స్వతంత్రం సాధించాడు మహాత్మా గాంధీ . నాడు మోహన్ దాస్ కరం చంద్ గాంధీ లా చరిత్రలో నిలిచిపోవాల్సిన వ్యక్తి నేడు మహాత్ముడిలా నేటికీ  ప్రజల మన్ననలు అందుకుంటూనే ఉన్నాడు.

                    మహాత్మ గాంధీ గురించి మనం చిన్నప్పటి నుండి , ఇప్పటి వరకు ఎన్నో సార్లు వినే ఉంటాం. అతని గురుంచి ఎన్నో పుస్తకాల్లో చదివి ఉంటాం కానీ, మహాత్మా గాంధీ గురుంచి మనకు ఎంత తెలిసినప్పటికీ అది చాలా  తక్కువ.

                   అసలు గాంధీ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, అతను ఒక సామాన్య  విద్యార్థా   లేక  తెలివైన విద్యార్థా, , తన తోటి విద్యార్థులతో ఎలా ఉండేవాడు, పదమూడు సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నప్పుడు ఆ సమయంలో గాంధీ ఎలా ఆలోచించాడు, చిన్నప్పుడు గాంధీజీ కి కస్తూర్బా గాంధీ కి మధ్యన సంబంధం ఎలా ఉండేది, ఇతర మతాల పైన , కులాలపైనా అతని అభిప్రాయం ఎలా ఉండేది, చిన్నప్పుడు గాంధీజీ జీవితంలో జీవితం లో జరిగిన మధురమైన , ఆసక్తికరమైన సంఘటనలు ఏవి, మహాత్మా గాంధీ ని పూర్తి గా మార్చివేసిన సంఘటనలు ఏవి, ఏ పరిస్థితుల్లో అతను లా చదువుకోవటానికి ఇంగ్లాండు వెళ్ళాడు, ఇంగ్లాండు లో ఆ మూడు సంవత్సరాలలో అతను ఎదుర్కొన్న సంఘటనలు ఏవి, కరుడుగట్టిన బ్రహచర్యాన్ని ఎలా పాటించాడు. దక్షిణ ఆఫ్రికా లో గాంధీజీకి అవమానం ఎలా జరిగింది, ఆ తరువాత అతను అక్కడ ఏం చేసాడు , అసలు దక్షిణ ఆఫ్రికా కు ఎందుకు వెళ్ళాడు, తిరిగి ఎందుకు వచ్చాడు , భారతదేశం లో గొప్ప గొప్ప వ్యక్తులకు గాంధీజీ కి మధ్య జరిగిన సంఘటనలు ఏవి, స్వాతంత్రోద్యమం లో ఎలా వ్యవహరించాడు ,

             అసలు ఒక మాములు వ్యక్తి అయిన గాంధీ,  మహాత్మగాంధీ  ఎలా అయ్యాడు. 

  మహాత్మ గాంధీ జీవితం లో మీకు తెలియని ఆసక్తికర విశేషాలు.. !

 మీకు తెలియని మహాత్మ గాంధీజీ ని కొత్తగా పరిచయం  చేసేందుకే  ఈ నా ప్రయత్నం..

                           
                                                                                    written by,

                                                                              M.R. Ravindra Nath Tagore
                             

Read More
    1

Are you job seekers or job creators....?



                              " నా చుట్టూ ఉన్న సమాజంలో  నేను చాలా ప్రత్యేకం, నా వ్యక్తిత్వం కానీ , నాకున్న  లక్ష్యాలు కానీ , లక్షణాలు   కానీ అందరి కన్నా చాలా విభిన్నం, నా ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి , వాటిని ఎవరు అందుకోలేరు" ,  అని ఎవరికి వారు రకరకాలుగా   వారి గురుంచి, తమ జీవితం గురుంచి చాలా సార్లు చెప్పుకుంటూనే  ఉంటారు. కానీ ఒక్కసారి నిజ జీవితంలో వచ్చి వాస్తవాలను విభిన్న దృష్టి తో పరిశీలిస్తే మనం ఎవ్వరం ప్రత్యేకం కాదని  తెలుస్తుంది.  నలుగురు నడిచే దారిలోనే మనం కూడా నడుస్తున్నాం అని అర్థమవుతుంది. ఈ అనంత భారతంలో ఉన్న ఎన్నో  కోట్ల మంది నిరుద్యోగుల లాగానే మనం కూడా చివరికి ఉద్యోగాల వేటలో పడి మన ఆలోచనలను మనతోనే అంతం చేసుకుంటున్నాం. మన ఆలోచనలను , మన మెదడులో ఉన్న జ్ఞానాన్ని , ఒక ఉద్యోగిగా , మనం ఇంకెవడో జీవితం లో ఎదగటానికి ఉపయోగిస్తాం, కానీ వాటిని మన కోసం ఉపయోగించం , ఎందుకంటె మనం సామాన్యులం కాబట్టి , మన వల్ల కాదు అని మనం మన బుర్రలో గట్టిగా నిర్ణయించుకున్నాం  కాబట్టి.  ఉద్యోగాన్ని అర్థించే ఉద్యోగార్థి గా నే మనం ఆలోచిస్తాం తప్ప, వ్యాపారవేత్తలుగా ఎదిగి, నిరుద్యోగ భారతాన్ని అంతం చేయాలనే ఆలోచన మనలో చాలా  తక్కువ మందికే ఉంటుంది.

అసలు ఎందుకు మనం వ్యాపారవేత్తలుగా ఎదగాలి, ఎదిగి ఏం సాధించాలి...?


  ఓ ముప్పై ఏళ్ళ యువకుడు తనకున్న ఒక కొత్త ఐడియా తో కొత్తగా వ్యాపారం చేద్దామని,  తాను పనిచేస్తున్న కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ హోదాను వదులుకుని, బయటకు వచ్చేసాడు. తన చుట్టూ ఉన్న సమాజం తనను చూసి నవ్వింది. తెలిసిన వాళ్ళు ఉచిత సలహాలు ఇవ్వటం మొదలు పెట్టారు. అయినా ఒక్క అడుగు కూడా వెనుకకు వేయలేదు. చివరికి అతను సాధించాడు. తన  వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచం నలుమూలలకు విస్తరించాడు. తన ఐడియా ఆరు లక్షల మందికి ఉపాధినిచ్చింది, అంతేకాదు  తనను లక్షల కోట్లకు అధిపతిని చేసింది.అతడే జెఫ్ బెజోస్. అతని ఆలోచనే అమెజాన్ .



  అతను ఓ నిరుద్యోగి , ఇంకా గట్టిగా  చెప్పాలంటే దరిద్రానికి చాల దగ్గరి బంధువు. దాదాపు ముప్పై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే ఏ ఒక్కరు అతని ఫై కనికరం చూపలేదు. అంతేనా  విధి కూడా అతనితో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంది. కానీ అతను మాత్రం అదరలేదు, బెదరలేదు. ఒకరిని నేను ఉద్యోగం అడగటం ఏమిటి  లక్షల మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి అని అనుకున్నాడు . చివరికి తాను అనుకున్నది సాధించాడు, ఏకంగా మహాసముద్రం లాంటి చైనా వ్యాపార సామ్రాజ్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. కోట్లకు కాదు.. కాదు.. లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు.  అతనే అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా .

  


  పరిస్థితుల ప్రభావం వల్ల దేశం కానీ దేశం లో పెట్రోల్ బంక్ లో పనిచేయవల్సివచ్చింది. చదివింది కూడా పెద్దగా ఏం  లేదు.కానీ మనసులో ఏదో చేయాలన్న తపన మాత్రం ఉంది. తన ఆలోచనలకు కార్యరూపం ఇవ్వటానికి  తన సొంత దేశానికీ తిరిగి వచ్చేసాడు. నాడు ముంబై  లో  ఓ చిన్న వీధిలోని ఇరుకు గదిలో ప్రారంభించబడిన రిలయన్స్ అనే  కంపెనీ  విలువ  నేడు అక్షరాలా 8 లక్షల కోట్లు. వినటానికే ఆశర్యంగా ఉన్నా, ఇది  నిజం . అంతే కాదు ఆనాడు ఆ వ్యక్తి  మదిలో మెదిలిన  ఆలోచన నేడు రెండు లక్షల మందికి ఉపాధినిచ్చింది. అతనే ధీరుభాయి అంబానీ.


  చెప్పుకోవటానికి వీరొక్కరే కాదు, జుకెర్ బర్గ్, అజీమ్ ప్రేమ్ జీ, కుమార్ మంగళం బిర్లా, లక్ష్మి మిట్టల్, నారాయణ్ మూర్తి, ఆనంద్ మహీంద్రా.. ఇలా ఎందరో ఒక్కప్పుడు మనలాగే అతి సామాన్యులు, కానీ వారి ఆలోచనలు వారిని సామాన్యులుగా ఉండనివ్వలేదు. ఆ ఆలోచనలే వారిని గొప్ప వారిని చేసాయి. ఆ  ఆలోచనలే వారితో పాటు లక్షల మందికి  ఉపాధిని కల్పించాయి. వీరు  కూడా అందరి లాగే ఏ కంపెనీలోనో ఉద్యోగం చేస్తూ ఇదే జీవితం అనుకుని ఉంటె, ప్రపంచపు గతిని  మార్చిన వ్యాపార సామ్రాజ్యాలు ఆవిర్భవించేవి కావు. వాటి గురుంచి  మాట్లాడుకునే అవకాశం కూడా మనకు వచ్చి ఉండేది కాదు.

➤ ➤   ఎందుకు బిజినెస్ చేయాలి..?

                            నేటి  మన  భారతం లోని పేదరికం , నిరుద్యోగం గురుంచి, విన్నప్పుడు దీనికి కారణం అయిన నీతిమాలిన నాయకులను, అవినీతికి  అలవాటుపడిన అధికారులను మనకు ఇష్టం వచ్చినట్టు తిడుతాం , కానీ వాటిని రూపుమాపడానికి మనం ఏమి చేయం,  ఎందుకంటే  , మన చుట్టూ ఉన్న సమాజం మార్చటానికి ఎవరో ఎక్కడ్నుంచో వస్తారని, మనం నమ్ముతాం కనుక. మనలోనే అనంతమైన శక్తి ఉందని మనం గుర్తించం, దాన్ని బయటకు తీయం, అపారమైన జ్ఞానాన్ని , అనంతమైన తెలివిని మనలో పెట్టుకుని, ఎవరో ఇంకొకరి దగ్గరికి, వారిచే లక్షల ప్యాకేజీ కోసం  , మనలో ఉన్న వ్యాపార ఆలోచనలను మనతోనే అంతం చేసుకుంటున్నాము.

                               ప్రతి ఒక్కరి ఏవో కొన్ని వ్యాపార ఆలోచనలు ఉంటాయి, వాటిని బయటకు తీస్తే ఆ ఆలోచన తో పాటు, మీరు కూడా గొప్ప వారయ్య అవకాశం ఉంటుంది, కానీ వాటిని బయటకు తీయం, ఎందుకంటే...... భయం, మన మీద మనకు భయం,చేయగలనా లేదా అనే భయం , మన  చుట్టూ ఉన్న సమాజం  ఏమంటుందో అన్న భయం,  చుట్టూ ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తారేమో , ఇంట్లో తల్లితండ్రులు ఏమంటారో అన్న భయం, ఇలాంటి ఎన్నో భయాల మధ్య మనలో మెదడులో ఉద్భవించే కొత్త ఐడియా లను గడిచిపోయిన కాలం తో  పాటే  సాగనంపుతున్నాం.


                       
           మీ  జీవితం లో ఒకే ఒక్క అడుగు, ఎంట్ర పెన్యూర్స్ గా మారటానికి, ...........చాలు .. మీ  చుట్టూ ఉన్న ఎందరో జీవితాలను  మీరొక్కరే మార్చవచ్చు ... !   కేవలం మీరొక్కరే .. ! మీ చుట్టూ ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉండనివ్వని, వాటిని  మీకు అనుకూలంగా మలుచుకోండి.

                      అవకాశాల కోసం ఎదురుచూడటం మానుకో, నీ తెలివితో వాటిని  సృష్టించుకో.

చరిత్రలో ఎందరో కూటికి కూడా గతి లేని వారు , వ్యాపార రాజ్యం లోకి అడుగుపెట్టి , శిఖరాలను చేరుకున్నారు.ఆనాటి  వారి పరిస్థితులు మనకు లేవు కదా..!


           ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మహా అయితే ఏమవుతుంది, ప్రాణాలైతే పోవు కదా.. ? జరిగేవి రెండే రెండు . ఒకటి  వ్యాపారవేత్త గా మీరు ఎదిగితే ఈ ప్రపంచానికి మీరు ఒక గొప్ప  విజేత గా పరిచయం అవుతారు, మీ చుట్టూ ఉన్న వారు మీకు జేజేలు పలుకుతారు. అదే ఓడితే మీకు మీరు  సరికొత్తగా పరిచయం అయ్యే ఓ గొప్ప అవకాశం , జీవితమంటే ఏంటో తెలుసుకునే ఓ ఘనమైన భాగ్యం మీకు కలుగుతుంది.. ఒక సంపూర్ణమైన మానవ జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి ....? 

   గుర్తుపెట్టుకోండి... !   

         మన వర్తమాన భారత దేశానికీ  కావాల్సింది , ఇరవైనాలుగు గంటలు పనిచేసే ఉద్యోగులు కాదు, 
ఆ ఉద్యోగాలను సృష్టించే తెలివైన వ్యాపారవేత్తలు .. 
                                             ఆ తెలివి మీలో ఉందా .. ?

                                                                            ఆలోచించండి ,  ఒక్కసారి ఆలోచించండి.


                                                                                        written by, 

                                                       M . R . RAVINDRA NATH TAGORE.

 

                          
Read More
    4

ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి -- మేడం క్యూరీ

                               

                    1891 లో ఓ 24   ఏళ్ళ యువతి తాను కన్న కలలను సాధించటం కోసం, తన చుట్టూ ఉన్న సమాజానికి  ఏదో చేయాలనే  కసి తో  పోలాండ్ నుండి పారిస్ కు వచ్చింది. అప్పటికే తన తల్లి చనిపోయింది.  డబ్బులు పెట్టి మంచి గది తీసుకోలేక , ఎముకలు కొరికే ఆ  చలిలో ఒక చిన్న పూరి పాకలో ఉంటూ చదువుకొనేది. తినడానికి డబ్బులు లేక రొట్టెను నీళ్లలో ముంచుకు తినేది. అంతటి దారుణమైన పరిస్థితులలో కూడా ఆమె తన లక్ష్యాన్ని మరువలేదు. ట్యూషన్లు చెబుతూ , ఆ వచ్చిన డబ్బులతో బతికి, ఏకంగా  యూనివర్సిటీ ఫస్ట్  వచ్చింది. తాను ఉన్న పూరి పాకనే ప్రయోగశాలగా మార్చుకుని, కాన్సర్ మహమ్మారి ని అంతం చేయాలనే సంకల్పంతో ప్రయోగాలు మొదలు పెట్టింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు మాత్రం వేయలేదు. చివరికి ఆమె సాధించింది . అవును ఆమె నోబెల్ ప్రైజ్ సాధించింది, ఒకటి కాదు ,  రెండు నోబెల్ బహుమతులను సాధించింది. పరోక్షంగా ఆరు నోబెల్  బహుమతులకు  ఆమె కారణం అయ్యింది. ఆనాటి పురుషాధిక్యత సమాజం లో ఒక మహిళ ఇంత గొప్ప విజయం  సాధించటమా,  ఇంతకీ ఎవరు ఆమె, ఆవిడే మేడం క్యూరీ . 

                          మీకు తెలియని భయంకరమైన , ఆశ్చర్యకరమైన వింత మరణాలు
       

        
                    పోలాండ్ దేశానికీ చెందిన మేరీ క్యూరీ 1867 లో పుట్టింది. ,  చిన్నప్పుడే తన తల్లి , చనిపోవటం తో కుటుంబ భారమంతా తండ్రి పైనే పడింది. ఆ బాధ్యత తోనే మేరీ క్యూరీ ఎంతో శ్రద్దగా చదువుకునేది. తండ్రి లాగే ట్యూషన్లు చెబుతూ, తన మిగతా ముగ్గురు అక్కలకు అండగా నిలిచింది. అప్పుడు ఆమె వయసులో చిన్నది కావచ్చు, కానీ  తన కుటుంబానికి ఆమె అండగా నిలిచింది .తన  తండ్రి కోరిక మేరకు, తాను కన్నకలలను నిజం చేసుకోవటానికి ఆమె  పారిస్ పయనం అయ్యింది. 

➤  పూరి పాకే తన ప్రయోగశాల :

                         అంతటి పారిస్ మహా నగరంలో , చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా, ఆమె ఏ మాత్రం బెదరలేదు. తన లక్ష్యాన్ని ఏ మాత్రం దూరం చేసుకోలేదు. తినటానికి తిండి లేని ఎన్నో రోజుల్లో కూడా ఆమెలో ఆత్మవిశ్వాసం మచ్చుకైనా తగ్గలేదు. డబ్బులు పెట్టి మంచి గది తీసుకోలేక , ఎముకలు కొరికే ఆ  చలిలో ఒక చిన్న పూరి పాకలో ఉంటూ చదువుకొనేది. తినడానికి డబ్బులు లేక రొట్టెను నీళ్లలో ముంచుకు తినేది. అంతటి దారుణమైన పరిస్థితులలో కూడా ఆమె తన లక్ష్యాన్ని మరువలేదు. ట్యూషన్లు చెబుతూ , ఆ వచ్చిన డబ్బులతో బతికి, ఏకంగా ఇంగ్లీష్ లో   యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. ఆ తరువాత తండ్రి  సూచన మేరకు ఫిజిక్స్ ఫై తన దృష్టి ని నిలిపింది. 

     
                     తాను ఉంటున్న పూరి పాకనే ప్రయోగశాలగా మార్చుకుంది.అలా చదువు కొనసాగిస్తుండగా ప్రేమ ప్రయత్నంలో మోసపోయి ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయింది. తరువాత తాను నిలదొక్కుకుని నిబ్బరంగా ఆలోచించి..‘‘ఒక చిన్న దెబ్బ తగిలితే ఆత్మహత్యా? నా కోసం తపిస్తున్న నా తండ్రి నా తోడబుట్టిన వాళ్ళు... వారిపట్ల నాబాధ్యత ఇదేనా’’ అని ఆత్మవిమర్శ చేసుకుంటూ ‘‘...కాదు, కాదు... ఎక్కడ కింద పడ్డానో అక్కడే పైకి లేవాలి. నాకు జరిగిన మోసాన్ని ఒక పీడకలగా మర్చిపోవాలి’ అని దృఢంగా నిశ్చయించుకుంది. 
    
     
                                  తన శక్తిని మొత్తాన్నీ ఫిజిక్స్‌ మీద పెట్టింది. మళ్ళీ వివాహం చేసుకుని గర్భిణీ అయి ఉండి కూడా, భర్తతో కలిసి ప్రయోగాలు చేస్తూ , క్యాన్సర్‌కు చికిత్స చేయతగిన మూలకాన్ని కనిపెట్టి యురేనియం అని ధ్వనించేటట్లుగా తన మాతృదేశంపేరుని జోడించి ‘పొలేరియం’ అని పేరుపెట్టి తన దేశభక్తి చాటుకుంది. ఆమెచేసిన కృషికి గుర్తింపు లభించి ‘నోబెల్‌ బహుమతి’ లభించింది. ఆమెతో కలిసి పనిచేసినందుకు ఆమె భర్తకు, ఆమె గురువుకు మరో రెండు నోబెల్‌ బహుమతులొచ్చాయి. దానితో బాగా ఐశ్వర్యం కూడా వచ్చింది.  ఆ సంతోషం ఎక్కువకాలం నిలవకుండానే తండ్రి చనిపోయాడు... మరికొద్ది రోజుల్లోనే రోడ్డు ప్రమాదంలో భర్త కూడా చనిపోయాడు. అప్పటికి ఆమె వయసు 40 దాటలేదు. క్యాన్సర్‌కు ఔషధం కనిపెట్టడానికి రోజుకు 18 గంటలు కష్టపడి ఆరోగ్యాన్ని ఎంతగా త్యాగం చేసేసిందంటే.. ఆమెకే  బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చింది.అయినా ఆమె వెరవలేదు. ఆ పరుగు,  ఆ పట్టుదల, ఆ కసి ఆగలేదు...ఈ సారి కెమిస్ట్రీలో మరొక ‘నోబెల్‌’ బహుమతి తెచ్చుకుంది. ఆమె దార్శనికత వలన ఆమె కూతురికి, అల్లుడికి కూడా మరో రెండు నోబెల్‌ బహుమతులొచ్చాయి. అంటే ఆమె ఒక్కతే ఆరు నోబెల్‌ బహుమతులకు కారణమయింది. 

                         ఆమె  తన పరిశోధనలకు పేటెంట్‌ తీసుకుని ఉంటే తదనంతరకాలంలో ఆమె వంశీకులకు బిల్‌గేట్స్‌ కన్నా వెయ్యి రెట్ల ఐశ్వర్యం వచ్చి ఉండేది. కానీ ‘‘అది భూమిలోంచి వచ్చింది, ప్రకృతి ఇచ్చింది. అది ప్రజలకు అందాలి. ఆ పేటెంట్‌ తీసుకోవడానికి నేనెవర్ని. నాకు అక్కరలేదు.’’ అని చెప్పేసింది. చివరగా తను కోరుకున్నదేమిటంటే తన సమాధిలో పిడికెడు మట్టి...అదీ తన జన్మభూమినుంచి తెచ్చి చల్లాలని కోరుకుంది.  




గుర్తుపెట్టుకోండి. 

       చిన్నప్పటినుండి ఆమెను కష్టాలు నీడలా  వెంటాడాయి. అడుగడుగునా విధి  ఆమెతో ఆడుకుంది. తనకంటూ ఎవ్వరినీ లేకుండా చేసింది. కానీ ఆమె ఆ విధినే ఎదిరించి తన లక్ష్యాన్ని చేరుకుంది. ఆనాటి  పురుషాధిక్యత సమాజంలో ఉదయించి, ఎన్నటికీ తరగని, చెరగని కీర్తి ని సంపాదించి,  కొన్ని కోట్ల మంది గుండెల్లో ఆమె ధ్రువ తార గా నిలిచిపోయింది .   ఎవరి జీవితాలూ వడ్డించిన విస్తళ్ళు కావు. గులాబీ పువ్వు కింద ముళ్ళు చూసి భయపడిన వారు  జీవితంలో అక్కడే ఉంటారు. ఆ పువ్వు సౌందర్యాన్ని, సౌరభాన్ని చూడాలనుకున్నవారు  ముందుకే అడుగేస్తారు .   
                                                                                                                            choice is your's.



మూలం : సాక్షి దినపత్రిక 
    
Read More
    32

స్టీవ్ జాబ్స్ జీవితపు చివరి మాటలు --- తన మాటల్లోనే

                                       

                  సామాన్యంగా ఆలోచించేవారు  అద్భుతాలను  చూడాలనుకుంటారు. కానీ గొప్పగా ఆలోచించే వాళ్ళు మాత్రమే  అద్భుతాలను సృష్టించాలనుకుంటారు.  కొందరు ఉద్యోగాలు చేయాలని అనుకుంటారు, కానీ కొందరు మాత్రమే ఉద్యోగాలను ఇవ్వాలని అనుకుంటారు. చదువు మీద విరక్తితో కనీసం డిగ్రీ పట్టా కూడా అందుకోని అతను  వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. టెక్నాలజీ రంగం లో అతను చేసిన ప్రతి ఆవిష్కరణ ఒక గొప్ప అద్భుతం. అతను వచ్చాకే అసలు సిసలైన టెక్నాలజీ ప్రపంచానికి పరిచయం అయ్యింది.  20 ఏళ్లకే ఆపిల్ కంపెనీ ప్రారంభించి దానిని శిఖరాగ్రాన నిలబెట్టాడు. అతనే స్టీవ్ జాబ్స్.   

               ఎవరికి తెలుసు జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో . .కష్టాల కడలిని దాటిన అతనికి, మళ్ళీ వాటితో పరిచయం  ఏర్పడుతుందని బహుశా అతను కూడా ఊహించివుండడు. అతని ప్రతిభను చూసిన కాలం అసూయ పడి ఈ సారి కష్టాలను కాన్సర్ రూపం లో  పంపించింది.   ఎన్నో అద్భుతాలను సృష్టించిన స్టీవ్ జాబ్స్ కు మృత్యు దేవత పలకరించేంత వరకు జీవితం అంటే ఏంటో  తెలుసుకోలేకపోయాడు.  ఇన్ని రోజులు తానేం కోల్పోయాడో తన చివరి రోజుల్లో తెలుసుకున్నాడు. తన చివరి రోజుల్లో, మృత్యు దేవత ముంగిట ఉన్న అతను తన జీవితం గురించి  రాసుకున్న మాటలు , ఎంతో మంది హృదయాలను కంట తడి పెట్టించాయి.


                     "వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను నేను. విజయానికి ప్రతీకగా నిలిచాను. పని తప్ప వేరే ఆనందం నాకు తెలీదు. సంపాదనకే అంకితమైపోయాను. ఇప్పుడు, ఈ మరణశయ్య మీద రోజులు లెక్కపెట్టుకుంటున్న నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే. ఇన్నాళ్లు నేను గర్వపడిన పేరు, డబ్బు ఎందుకు కొరగానివని నాకు అనిపిస్తుంది. ఈ నిశిరాత్రిలో - నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తుంది. నాకిప్పుడనిపిస్తోంది..... జీవితంలో సరిపడ డబ్బు సంపాదించాక , మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయ్. కళలు, అనుబంధాలూ , చిన్నప్పటి కలలూ, కోరికలూ , సేవ.. ఇలా  డబ్బు కు మించిన కాల ప్రపంచం చాలా ఉంది. కానీ డబ్బు వెంట పెట్టె పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది. అందుకు నేనే ఉదాహరణ.  ఇతరుల మనసులోని ప్రేమను గుర్తించటానికే దేవుడు మనకి జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రం విలువనిచ్చే కాల్పనిక జగత్తును  మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు. నా ఆఖరి ప్రయాణములో అది నా వెంట రాదు. నేను నాతో తీసుకెళ్లగలిగేది ప్రేమానుభూతులు, అందమైన జ్ఞాపకాలు మాత్రమే. ఈ ప్రేమ పూర్వక అనుభూతులే ఎప్పుడు మనతో ఉంటాయి. మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. నిజం, అంత మన హృదయంలోనే, మన చేతుల్లోనే ఉంది."

స్టీవ్ జాబ్స్ తన చివరి రోజుల్లో

                   "ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా? నువ్వు రోగం తో బాధపడుతూ పడుకున్న మంచం. నీ కారు నడపడానికి ఒక  డ్రైవరును నియమించుకోగలవు. నీ కోసం సంపాదించిపెట్ట్టె ఉద్యోగులను నియమించుకోగలవు. కానీ నీ జబ్బును, నీ భాదను అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు. నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చు కానీ చేజారిన జీవితం మాత్రం తిరిగి పొందలేవు. జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా  - కథ ముగిసే రోజు, తెర పడే రోజు ఒకటి వస్తుంది. - అప్పుడు ఎంత ఆరాటపడిన కాలం వెనక్కి మళ్లదు , అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బును కాదు నీ కుటుంబాన్ని ప్రేమించు. నీ స్నేహితులను ప్రేమించు. ఆనందంగా జీవించు. అందరిని ఆనందంగా ఉంచు. " 
  
           

                    బరువెక్కిన విషాద హృదయంతో స్టీవ్ జాబ్స్ 2011లో ఈ లోకాన్ని వీడవలసివచ్చింది. కానీ తన జీవితంలో   తాను వేసిన ప్రతి అడుగు ప్రతి ఒక్కరికి ఆదర్శమే. చేసిన ప్రతి ఆవిష్కరణ ఒక గొప్ప అద్భుతమే. జీవితానికి తాను ఇచ్చిన నిర్వచనం , ఎంతో మందికి ఆదర్శప్రాయం. తాను జీవించిన జీవితంతోనే కాదు, తన చివరి మాటలతో కూడా, ఎంతో మందిని మేల్కొలిపాడు స్టీవ్ జాబ్స్.
చివరగా 
        చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కోకండి, మీకు ఆనందం కలిగే  పనులు మాత్రమే చేయండి.
             
                                                                   Written by
                                                  M.R . RAVINDRA NATH TAGORE

     
                                        teluguinspireworld111@gmail.com.
Read More
    28

Services

More Services

© 2014 The Tagore Times. Designed by Bloggertheme9 | Distributed By Gooyaabi Templates
Powered by Blogger.